తక్కువ కాలంలో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సాయి ధరమ్ తేజ్. తిక్క, విన్నర్ సినిమాలు ఆశించిన విజయం సాదించనప్పటికి మంచి ఫాలోయింగ్ ఉంది ఈ యువ హీరోకు, తాజాగా సాయి నటించిన ‘జవాన్’ సినిమా డిసెంబర్ 1 న విడుదల కానుంది.
‘జవాన్’ తరువాత సాయి వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు, ఆకుల శివ కథ అందించిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్, థమన్ సంగీతం అందిస్తున్నారు. బ్రహ్మానందం , సప్తగిరి ఫుల్ లెన్త్ కామెడీని పండించారని సమాచారం. ఫిబ్రవరి 9 న చిత్రాన్ని చిత్రాన్ని విడుదల చెయ్యనున్నారు నిర్మాతలు.