బాధితుల కోసం 50వేల బియ్యం బస్తాలు పంపిన సాయి కొర్రపాటి

బాధితుల కోసం 50వేల బియ్యం బస్తాలు పంపిన సాయి కొర్రపాటి

Published on Oct 15, 2014 7:00 PM IST

Sai-Korrapati
హుదూద్ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ముందుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్స్, దర్శకులు, నిర్మాతలు తమ వంతుగా విరాళాలను అందించారు. వీరి లిస్టులో తాజాగా ‘ఈగ’ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి వచ్చి చేరారు.
సాయి కొర్రపాటి అందరిలా ఆర్ధికంగా సహాయం చేయకుండా.. అక్కడ తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతూ విపత్కర పరిస్థితుల్లో ఉన్న వారికి భోజనం అందించాలనే ఉద్దేశంతో బియ్యం కొని పంపారు. సాయి కొర్రపాటి అప్పటికప్పుడు నెల్లూరులో 100 టన్నుల భియ్యం ని కొనుగోలు చేసారు. దాన్ని 20 కేజీల బ్యాగుల్లో నింపి మొత్తం 50 వేల బస్తాలను వైజాగ్ కి పంపారు.
‘ఇది కేవలం మొదటి విడతే అని మలి విడతలో కూడా పలువురికి సహాయం అందించేలా చూస్తాను అన్నారు. అంతే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలకి ఏమి అవసరం ఉన్నా ఆ అవసరాన్ని తీర్చడానికి ముందు వరుసలో ఉంటానని’ సాయి కొర్రపాటి హామీ ఇచ్చారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో సాయి కొర్రపాటి తీసుకున్న నిర్ణయం అబినందించదగినది పలువురు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు