ఫస్ట్ ప్రొడక్షన్‌పై ఎగ్జైటింగ్‌గా ఉన్న సాయికుమార్!

ఫస్ట్ ప్రొడక్షన్‌పై ఎగ్జైటింగ్‌గా ఉన్న సాయికుమార్!

Published on Feb 8, 2016 7:27 PM IST

Sai-Kumar
ప్రముఖ నటుడు సాయికుమార్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోగా వరుస సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న ఆది తాజాగా ‘గరం’ అనే సినిమాతో సిద్ధమైన విషయం తెలిసిందే. దర్శక, రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొద్దికాలంగా సరైన రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తూ వచ్చిన గరం టీమ్ చివరకు ఫిబ్రవరి రెండో వారమైన వాలంటైన్స్ వారానికి ఫిక్స్ అయింది.

సాయికుమార్ తన సొంత బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇక మొదటి సారి తమ సంస్థలో ఒక సినిమా రానుండడం పట్ల సాయికుమార్ చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. అన్ని కమర్షియల్ అంశాలను మేళవించుకున్న ఈ సినిమా కథలో మంచి కొత్తదనం ఉందని, అన్ని వర్గాల ప్రేక్షకులకూ సినిమా నచ్చుతుందని సాయికుమార్ అన్నారు. ఇక ఇదే సంస్థలో ‘గరం’ తర్వాత వరుసగా సినిమాలు నిర్మించే ఆలోచన ఉందని, అందుకు తగ్గ సన్నాహాలు కూడా చేస్తున్నామని సాయికుమార్ ఈ సందర్భంగా తెలిపారు. ఆది సరసన అదా శర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు