కీలక నిర్ణయం తీసుకున్న ‘సాయి ధరమ్ తేజ్’ !

కీలక నిర్ణయం తీసుకున్న ‘సాయి ధరమ్ తేజ్’ !

Published on Apr 10, 2020 11:39 PM IST

‘చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ లాంటి విజయాలతో ఇప్పుడిప్పుడే తేరుకున్న తేజ్ ఆ తరహాలోనే ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే ఎంటెర్టైనర్ చేస్తున్నారు. అయితే తేజ్ తన సినిమాలోని సాంగ్స్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇటివలే తేజ్ ను ఉద్దేశించి.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ఇక నుండైనా నా సాంగ్స్ ను రీమిక్స్ చేసే ముందు నాకు చెప్పి చెయ్’ అని సరదాగా కామెంట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే తేజ్ ఇక పై మెగాస్టార్ క్లాసిక్ సాంగ్స్ ను టచ్ చేయకూడదు అని డిసైడ్ అయ్యాడట. సినిమాలో సిచ్యుయేషన్ డిమాండ్ చేసినా సరే.. క్లాసిక్ సాంగ్స్ జోలికి ఇకనుండి వెళ్ళడు అట. కాగా కొన్నాళ్ల క్రితం వరకు బలంలేని కథల్ని ఎంచుకుని బోర్ కొట్టించిన తేజ్ ఇప్పుడు జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే దేవ కట్ట సినిమా కూడా చేస్తున్నాడు.

సాయి తేజ్ – దేవ కట్ట సినిమాకు మణిశర్మ సంగీతం అందించబోతున్నారు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై భగవాన్, పుల్లారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్‌ డ్రాప్‌ తో తెరకెక్కబోతుందని.. దేవకట్టా గత సినిమాల శైలిలోనే ఈ సినిమా ఉండబోతుందని సమాచారం.

ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తుండగా జగపతిబాబు, రమకృష్ణ ఇతర కీలకపాత్రధారుల్లో కనబడనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు