మళ్ళీ ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి ఎస్.పి చరణ్

మళ్ళీ ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి ఎస్.పి చరణ్

Published on Jan 25, 2015 4:00 PM IST

sp-charan
లెజండ్రీ ప్లే బ్యాక్ సింగర్ అయిన ఎస్.పి బాలసుబ్రమణ్యం తనయుడు ఎస్.పి చరణ్ సింగర్ గానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తున్నాడు. గతంలో తమిళ్ లో కొన్ని పాత్ బ్రేకింగ్ సినిమాలను నిర్మించిన చరణ్ కి ‘అరణ్య కాండం’ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. అంతే కాకుండా ఇదొక కల్ట్ సినిమాగా నిలిచిపోయింది. ఆ తర్వాత నిర్మాతగా కాస్త గ్యాప్ ఇచ్చిన ఎస్.పి చరణ్ ‘మూడు ముక్కల్లో చెప్పాలంటే’ అనే ద్విభాషా చిత్రంతో నిర్మాతగా మళ్ళీ తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ సినిమా ఆడియో నిన్ననే హైదరబాద్ లో జరిగింది. ఈ సినిమా ద్వారా మధుమిత డైరెక్టర్ గా పరిచయం అవుతూ ఉంటే ఫేమస్ లిరిసిస్ట్ వెన్నెలకంటి కుమారుడు రాఖేందు మౌళి హీరోగా పోరిచయం అవుతున్నాడు. రాఖేందు మౌళి అందాల రాక్షసి సినిమాతో లిరిసిస్ట్ మరియు సింగర్ గా పరిచయం అయ్యాడు. అదితి చెంగప్ప హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కార్తికేయ మూర్తి మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు