‘రుద్రమదేవి’తో పరిచయం కానున్న శ్రీ కాంత్ వారసులు

‘రుద్రమదేవి’తో పరిచయం కానున్న శ్రీ కాంత్ వారసులు

Published on Apr 22, 2014 4:31 PM IST

srikantha-son
భారీ సెట్స్, భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరెకెక్కిస్తున్న సినిమా ‘రుద్రమదేవి 3డి’. మొట్ట మొదటిసారి ఇండియాలో ఓ హిస్టారికల్ సినిమాని 3డిలో షూట్ చేస్తున్నారు. అనుష్క టైటిల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో రానా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఎంతో మంది స్టార్ నటీనటులు నటిస్తున్న ఈ సినిమా ద్వారా మరో ఇద్దరు ఫ్యూచర్ స్టార్స్ ని కూడా గుణశేఖర్ పరిచయం చేస్తున్నాడు.

ఆ ఇద్దరు బుడతలు ఎవరో కాదు ఫ్యామిలీ హీరోగా తెలుగు వారికి పరిచయం ఉన్న శ్రీ కాంత్ వారసులు.. రుద్రమదేవి సినిమా ద్వారా శ్రీ కాంత్ కుమారుడు రోషన్, కుమార్తె మేథ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారు. గుణశేఖర్ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు.

కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, కేథరిన్, హంసా నందిని, బాబా సెహగల్, సుమన్, విజయ్, విక్రమ్ జీత్ సింగ్ కీలాక్ పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు