
ఒకే వేదికపై భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలను ఒకే వేదికపై చూసే అరుదైన అదృష్టం త్వరలో ప్రేక్షకులకు కలగనుంది. ఈ అద్బుత దృశ్యం ఆవిష్కృతమయ్యె ఘట్టానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వేదికను సిద్దం చేస్తుంది. నవంబర్ 29న బెంగుళూరులో కంఠీరవ, స్వర్గీయ రాజ్ కుమార్ మెమోరియల్ ప్రారంభోత్సవం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాంగణానికి ‘రాజ్ కుమార్ పుణ్యభూమి’ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేయడం కోసం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలను ఆహ్వానిస్తున్నారు.
ఆహ్వానితుల జాబితాలో రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, మమ్ముట్టీ, మోహన్ లాల్, చిరంజీవి తదితరులు ఉన్నారు. వీరందరూ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

