
జయాపజయాలతో సంబంధంలేకుండా వరుసపెట్టి ఆఫర్లను సంపాదించుకుంటూ యువ తారల అగ్రనటుల జాబితాలోకి చేరువవుతున్న నటులలో సందీప్ కిషన్ ఒకరు. సందీప్ నటించిన ‘బీరువా’ షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘టైగర్’ షూటింగ్ లో పాల్గుంటున్నాడు
కాశీలో ఈ సినిమా ముఖ్య సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటుంది. రాహుల్ రవిచందర్, సందీప్ ల నడుమ ఈ షూటింగ్ చోటుచేసుకుంటుంది. మురగదాస్ శిష్యుడు ఆనంద్ ఈ సినిమాకు దర్శకుడు. రన్ రాజా రన్ ఫేం శీరత్ కపూర్ హీరోయిన్. థమన్ సంగీత దర్శకుడు. చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్

