పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న దమ్ము

పోల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటున్న దమ్ము

Published on Feb 1, 2012 2:03 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ హేరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దమ్ము’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పోల్లాచ్చిలో జరుగుతుంది. రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో కీలకమైన యాక్షన్ సన్నివేశాల్ని ఇక్కడే చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ మరియు చిత్రం ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. ఇక్కడే లాంగ్ షెడ్యుల్లో ముఖ్యమైన సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నారు. త్రిషా మెయిన్ హీరొయిన్ గా నటిస్తుండగా కార్తీక రెండవ హీరొయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తుండగా అలెగ్జాన్డర్ వల్లభ నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కెఎస్. రామారావు సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎమ్ఎమ్. కీరవాణి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు