తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై’ తెలుగునాట ‘అభిమన్యుడు’ పేరుతో గత శుక్రవారం విడుదలైంది. తమిళంలో ఘన విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని కూడ మెప్పిస్తోంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ టెక్నో యాక్షన్ థ్రిల్లర్ శుక్రవారం రోజు విడుదలైన మిగతా రెండు తెలుగు సినిమాలు ‘ఆఫీసర్, రాజుగాడు’ బాక్సాఫీస్ వద్ద డీలా పడటంతో శని, ఆదివారాల్లో సైతం మంచి రన్ కనబర్చి రూ.6.35 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.
చిత్ర టీమ్ సమాచారం మేరకు ఏరియాల వారీగా వసూళ్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఏరియా | వసూళ్లు |
నైజాం | రూ.2.88 కోట్లు |
సీడెడ్ | రూ.68.43 లక్షలు |
ఉత్తరాంధ్ర | రూ.75.46 లక్షలు |
వెస్ట్ గోదావరి | రూ. 25.32 లక్షలు |
ఈస్ట్ గోదావరి | రూ. 39.47 లక్షలు |
కృష్ణ | రూ.56.71 లక్షలు |
గుంటూరు | రూ.53.46 లక్షలు |
నెల్లూరు |
రూ.27.84 లక్షలు
|
పిఎస్.మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సమంత కథానాయకిగా నటించగా యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు.