మహానటి చిత్రంతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం అనుజా చౌహాన్ నవలను బేస్ చేసుకోని ‘జో యా ఫ్యాక్టర్’ అనే చిత్రం తెరకెక్కుతుంది. కాగా ఈ చిత్రంలో విరాట్ కోహ్లీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర అట, ఇప్పుడు ఆ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నాడు.
2011 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. ఓ రాజ్పుత్ యువతి ఇండియా క్రికెట్ టీమ్ ను కలుసుకుంటుంది. ఆ తర్వాత మన భారత్ టీమ్ వరల్డ్క్ప్ ను గెలుస్తోంది. ఆ గెలుపులో ఆ యువతి పాత్ర కూడా ఉందట. అందుకే మెన్ ఇన్ బ్లూకు అదృష్ట దేవతగా మారింది అంటుంది చిత్రబృందం. ఏమైనా దుల్కర్ సల్మాన్ విరాట్ కోహ్లీ పాత్రను పోషిస్తుంతుండటంతో అటు దుల్కర్ అభిమానాలు, ఇటు కోహ్లీ అభిమానులు చాలా ఆనందంగా ఉన్నారు.