రాజమౌళి కుమారుడు చిత్రం ఫిక్స్ !

రాజమౌళి కుమారుడు చిత్రం ఫిక్స్ !

Published on Nov 6, 2018 11:00 PM IST

రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ తెరక్కించబోతుంటే.. ఆయన కుమారుడు కార్తికేయ మాత్రం నిర్మాతగా మారి ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. బాహుబలి సీరీస్ కు రాజమౌళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అశ్విన్ గంగరాజును కార్తికేయ తన నిర్మాణంలో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాడు.

కాగా ఈ చిత్రం పేరు కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ‘ఆకాశవాణి’ అనే పేరుతో కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కార్తికేయకు నిర్మాతగా మారాయాలని ఇంట్రస్ట్ ఉన్నట్లు స్వయంగా రాజమౌళినే గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం కార్తికేయ నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఇక ఈ సినిమాలో నటించే నటీనటులను త్వరలోనే ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు