క్రైమ్ డ్రామాతో రానున్న ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ !

క్రైమ్ డ్రామాతో రానున్న ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ !

Published on Dec 17, 2019 7:05 AM IST

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ వంగ. ఈ చిత్రాన్ని హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ బ్లాక్ బస్టర్ అందుకుని అక్కడ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. దీంతో అక్కడి నిర్మాతలు సందీప్ సినిమాలకు ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి ముందుకొస్తున్నారు. ‘కబీర్ సింగ్’ చిత్ర నిర్మాత టీ-సిరీస్ భూషణ్ కుమార్, సినీ 1 స్టూడియోస్ మురాద్ ఖేతాని కలిసి సందీప్ తర్వాతి సినిమాను భారీ స్థాయిలో నిర్మించడానికి ముందుకొచ్చారు.

వీరితోపాటే సందీప్ సోదరుడు, ‘అర్జున్ రెడ్డి’ నిర్మాత ప్రణయ్ వంగ కూడా చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోనున్నారు. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ ఇదొక పాన్ ఇండియా సినిమా, క్రైమ్ డ్రామాగా ఉండబోతోందని అన్నారు. అంతేకాదు సందీప్ వంగ సినిమాలు భిన్నంగా ఉంటాయని, ఆయనతో ఇంకొన్ని సినిమాలు చేయడానికి సిద్దమవుతున్నామని చెప్పుకొచ్చారు. మరి ఈ డైరెక్టర్ ఈ సక్సెస్ ను ఎంతకాలం కొనసాగిస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు