ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జాంబి రెడ్డి’. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో కనిపించి అలరించిన నటుడు తేజ సజ్జ హీరోగా వస్తోన్న సినిమా ఇది. ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా హీరోయిన్ దక్ష నగార్కర్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం.. ‘జాంబి జోనర్లో రాబోతున్న తొలి తెలుగు సినిమా మా ‘జాంబి రెడ్డి’. హర్రర్ నేపథ్యం అయినప్పటికీ ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. కథాపరంగానే కాదు నా పాత్ర కూడా అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది’ అని అంటోంది కథానాయిక దక్ష నగార్కర్.
కథానాయిక దక్ష ఇంకా మాట్లాడుతూ,’నాకు హర్రర్ సినిమాలంటే చాలా ఇష్టం. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ కథతోపాటు నా పాత్ర ఎలా ఉంటుందో చెప్పినప్పుడు రెండో ఆలోచన లేకుండా గ్రీన్సిగల్ ఇచ్చాను. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా ఉండే చేశా. అలాగే ఫైట్లు కూడా చేశా. నా పాత్ర అందరినీ నవ్విస్తుంది. తెలుగులో వస్తున్న తొలి జాంబీ జోనర్ సినిమానే అయినప్పటికీ పక్కా కమర్షియల్ సినిమా. ఈ సినిమాతో మరిన్ని ఛాన్సులు వస్తాయని ఆశిస్తున్నా. కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేస్తా. ప్రస్తుతం రెండు పెద్ద బ్యానర్లలో చర్చలు జరుగుతున్నాయి. బెల్లంకొండ సురేష్ రెండో తనయుడుతో ఓ సినిమా చేస్తున్నా’ అని తెలిపింది.
తేజా సజ్జా, ఆనంది, దక్ష నగార్కర్ ప్రధాన పాత్రధారులుగా యాపిల్ ట్రీస్ స్టూడియోస్ పతాకంపై రాజశేఖర్ వర్మ నిర్మించిన ఈచిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.