మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్టైనర్ ‘బద్మాషులు’. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బి.బాలకృష్ణ, C.రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి ‘లోకం మారిందా’ సాంగ్ ను హీరో నవీన్ చంద్ర విడుదల చేశారు.
ఈ సందర్భంగా నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ‘బద్మాషులు టీజర్ హిలెరియస్ గా ఉంది. లోకం మారిందా సాంగ్ కూడా చాలా క్యాచీగా ఉంది. తేజ కూనూరు సంగీతం అందించారు. దివ్య మాలిక పాడిన ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకుంటున్నాను. జూన్ 6న విడుదల కాబోతున్న బద్మాషులు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ పాత్రలు విశేషంగా, రూరల్ రూటెడ్ కథ, కథనం, కామెడీ చాలా ఆర్గానిక్ గా ఈ చిత్రాల్లో ఉండబోతున్నాయి. డైరెక్టర్ శంకర్ చేగూరి టేకింగ్ చాలా రిఫ్రెషింగ్ గా అన్ని వర్గాల ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగా ఉండబోతోంది. జూన్ 6న ఈ చిత్రాన్ని దీపా ఆర్ట్స్ థియేటర్స్ లో విడుదల చెయ్యబోతోంది.


