హీరో నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘రంగ్ దే’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 26న గ్రాండ్గా రిలీజవుతోంది. ఈ సందర్భంగా నేడు మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘రంగ్ దే’కి పనిచేసిన అనుభవం, హీరో హీరోయిన్లు నితిన్, కీర్తి ఎంతగా ఈ కథను నమ్మారనే విషయం, లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ వ్యవహారశైలి గురించి వెంకీ అట్లూరి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
‘రంగ్ దే’ కథ ఎలా పుట్టింది?
‘మిస్టర్ మజ్ను’ సినిమా తర్వాత ఒక క్యూట్ ఫ్యామిలీ మూవీ చెయ్యాలనే ఆలోచన వచ్చిందని, పక్కింటి అబ్బాయి, పక్కింటి అమ్మాయి తరహా పాత్రలతో అలాంటి సినిమా చెయ్యాలనుకున్నప్పుడు అర్జున్, అను పాత్రలు నా మనసులో పుట్టాయి. అలా వచ్చిందే రంగ్ దే అని ఈ సినిమాలో లవ్ ఫ్యాక్టర్ కంటే ఎమోషన్ ఫ్యాక్టరే ఎక్కువగా ఉంటుందని అన్నారు.
రంగ్ దే కథాంశం ఏమిటి?
రంగ్ దే కథాంశం పక్క పక్కనే ఉండే రెండు కుటుంబాల కథ అని, సహజంగానే మనం మన ఇంట్లోవాళ్లను పక్కింటివాళ్లతో పోల్చి చూస్తుంటామని, అలాంటప్పుడు వాళ్ల మధ్య ప్రేమ, ద్వేషం లాంటి ఎమోషన్స్ ఏర్పడుతుంటాయని అన్నారు. అలా పక్కింట్లలో ఓ అబ్బాయి, ఓ అమ్మాయి మధ్య వ్యవహారం పెళ్లిదాకా వస్తే ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయనేది ఆసక్తికరంగా చిత్రీకరించామని, ఈ సినిమాలో కడుపుబ్బ నవ్వించే హాస్య సన్నివేశాలతో పాటు, మనసుని తట్టే భావోద్వేగ సన్నివేశాలూ ఉంటాయని అన్నారు.
రంగ్ దే అనే టైటిల్ పెట్టడం వెనుక ఏదైనా కారణం ఉందా?
ఇంద్రధనస్సులోని ఏడు రంగుల్లో ఒక్కొక్కటి ఒక్కో ఎమోషన్కు ప్రాతినిధ్యం వహిస్తుందని అలాగే ఈ సినిమా కథలో రకరకాల భావోద్వేగాలు ఉంటాయని అందుకే ‘రంగ్ దే’ అనే టైటిల్ పెట్టామని, ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్స్ ప్రముఖంగా కనిపిస్తాయని అన్నారు.
ఈ సినిమాకు హీరోగా మొదటి ఛాయిస్ నితిన్ యేనా?
ఈ కథ రాసుకున్న తర్వాత మొదట నితిన్ను కాకుండా వేరే హీరోలను అనుకున్నానని, ఈ సినిమా చేయడానికి సితార ఎంటర్టైన్మెంట్స్ ముందుకు వచ్చాక నితిన్ పేరును నిర్మాత నాగవంశీ సూచించారని అన్నారు. అయితే ఈ సినిమాకు నితిన్ ఒప్పుకుంటాడో, లేదోననే సందేహంతోనే నేను కథ చెప్పానని, అయితే తను సింగిల్ సిట్టింగ్లోనే ఓకే చేయడంతో నిజంగా నమ్మలేకపోయానని అన్నారు. కథను ఆయన అంతగా నమ్మాడని, నితిన్, కీర్తి అంతగా ఈ కథను నమ్మడంతో వాళ్ల పాత్రలతో మరింత బాగా ప్రయోగాలు చేయవచ్చనిపించిందని, ట్రైలర్ రిలీజ్ చేశాక నా సినిమాలకు ఎప్పుడూ రానంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని అన్నారు.
నితిన్, కీర్తి సురేష్లతో సెట్స్ మీద పనిచేసిన అనుభవం ఎలా అనిపించింది?
నితిన్ నాకు పదిహేనేళ్లుగా పరిచయం అని, అందువల్ల నాకు తనతో సెట్స్ మీద చాలా సౌకర్యంగా అనిపించిందని ఇక కీర్తి విషయానికి వస్తే ఆమె వెనుక ‘మహానటి’తో వచ్చిన పెద్ద పేరుంది. ఆమెతో ఎలా ఉంటుందో అనుకున్నానని కానీ రెండో రోజు నుంచే చాలా కంఫర్ట్ అట్మాస్పియర్ను ఆమె క్రియేట్ చేసిందని, ఆ ఇద్దరితో చాలా సౌకర్యంగా ఈ సినిమా చేశానని, నా కంటే ఈ సబ్జెక్టును నితిన్, కీర్తి గట్టిగా నమ్మారని, షూటింగ్ జరుగుతున్నంత సేపు కథ గురించి, సన్నివేశాల గురించి నాతో బాగా డిస్కస్ చేయడమే కాకుండా వారి పాత్రల్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు.
పీసీ శ్రీరామ్ లాంటి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్తో పనిచేశారు కదా.. మీకు ఎలా అనిపించింది?
పీసీ శ్రీరామ్ గారితో అయితే కలిసి పనిచేస్తానని నేను కలలో కూడా ఊహించలేదని, గూగుల్లో సెర్చ్ చేస్తే ఇండియాలోని టాప్ సినిమాటోగ్రాఫర్గా ఆయన పేరు ముందుగా వస్తుందని, కథ చెప్పగానే ఆయనకు నచ్చిందని అదొక షాక్ నాకు అని, ఆయన సెట్స్ మీద ఉంటే ఎవరూ రిలాక్స్ అవ్వడానికి ఛాన్సే ఉండదు నాతో సహా, ఆయన వల్లే 64 రోజుల్లో సినిమాని పూర్తి చేశామని అన్నారు. ఒక దర్శకుడ్ని అయ్యి కూడా ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నానని అన్నారు.
దేవి శ్రీప్రసాద్, శ్రీమణితో పనిచేసిన అనుభవం ఎలా ఉంది?
దేవి శ్రీప్రసాద్ ఈ సినిమాకు ఇచ్చిన సాంగ్స్ ఒకెత్తు అయితే, రీరికార్డింగ్ ఇంకో ఎత్తు అని, ఈ సినిమాకు పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా ప్లస్ అవుతాయని, ఇక శ్రీమణి అయితే ఈ సినిమాతో కలిపి నాకు 18 పాటలు రాసిచ్చాడని, వదులుకోవాలన్నా మేం ఇద్దరం ఒకర్నొకరం వదులుకోలేకపోతున్నామని అన్నారు.
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ గురించి ఏం చెబుతారు?
నిర్మాణ విలువల విషయంలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఏ రోజూ రాజీ పడలేదని, మేం ఇటలీలో షూటింగ్ ప్లాన్ చేసినప్పుడు అక్కడ లాక్డౌన్ విధించడంతో ఇండియాలోనే షూటింగ్ చేసేద్దామనుకున్నానని, నాగవంశీ అలా కాదని దుబాయ్లో ప్లాన్ చేయించారని, కథలోనూ దానికి తగ్గట్లుగా బ్యాక్డ్రాప్ మార్చామని అన్నారు. ఈ సినిమా కోసం ఖర్చు పెట్టినదంతా మీకు తెరమీద కనిపిస్తుంది.
మీ తదుపరి సినిమా ఏంటి?
సితార ఎంటర్టైన్మెంట్స్, దిల్ రాజు బ్యానర్ కలిసి నా తదుపరి చిత్రాన్ని నిర్మించబోతున్నాయని, అది లవ్ స్టోరీ కాదని వేరే తరహా సినిమా అని ఇంతకంటే ఎక్కువ విషయాలు దాని గురించి చెప్పలేనని అన్నారు.