లేటెస్ట్..”వీరమల్లు” లో మాసివ్ యాక్షన్ బ్లాక్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

లేటెస్ట్..”వీరమల్లు” లో మాసివ్ యాక్షన్ బ్లాక్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Nov 2, 2022 7:00 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కోసం అందరికి తెలిసిందే. మరి దీనిపై భారీ అంచనాలు సెట్ కాగా ఈ చిత్రం షూటింగ్ పై అయితే ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇప్పుడు మేకర్స్ అయితే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని పవన్ తో ప్లాన్ చేస్తున్నారట.

అంతే కాకుండా ఈ ఒక్క యాక్షన్ బ్లాక్ కోసమే సుమారు 8 నుంచి 10కోట్ల మేర మేకర్స్ ఖర్చు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి సే సీన్స్ అన్నీ కూడా పవన్ ముందు లుక్ లో కాకుండా కొత్తగా మార్చిన గడ్డం లుక్ లోనే ఉండబోతున్నాయని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా లో ఒక హైలైట్ గా కూడా ఈ సీన్ నిలుస్తోంది అని టాక్. మొత్తానికి అయితే ఓ మాసివ్ బ్లాక్ ఇప్పుడు నడుస్తోంది అని చెప్పి తీరాలి. ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు