షూటింగ్ మొదలుపెట్టుకున్న ‘ఏబిసిడి’ !

షూటింగ్ మొదలుపెట్టుకున్న ‘ఏబిసిడి’ !

Published on Jun 18, 2018 11:25 AM IST

మలయాళంలో మంచి సక్సెస్ సాధించిన చిత్రం ఏబిసిడి (అమెరికా బోర్న్డ్ కన్ఫ్యూజ్డ్ దేశి)ని తెలుగులోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లు శిరీష్ కథానాయకుడిగా నటిస్తున్నారు. మధుర శ్రీధర్, యాష్ రంగినేనిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నారు.

ఈరోజే పూజా కార్యక్తమాలతో ఈ చిత్రం లాంచ్ అయింది. రెగ్యులర్ షూట్ కూడ ఈరోజు నుండే మొదలైంది. అల్లు అరవింద్ చిత్రానికి మొదటి క్లాప్ కొత్తగా సురేష్ బాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రంలో ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్సార్ మీర్ కథానాయకిగా నటిస్తోంది. ఈ సినిమాకు కన్నడ కంపోజర్ జుడా శాండీ సంగీతాన్ని అందివ్వనున్నారు. ఈ చిత్రంపై అల్లు శిరీష్ చాలా నమ్మకంగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు