తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కి సమిష్టిగా పని చేయాలి – ఎటిఎఫ్పిజి

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కి సమిష్టిగా పని చేయాలి – ఎటిఎఫ్పిజి

Published on Aug 23, 2021 4:53 PM IST

తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ ఆగస్టు 20, 2021 న మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అందుకు సంబంధించిన ప్రెస్‌నోట్‌ ను యాక్టిివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ విడుదల చేయడం జరిగింది. ఈ ప్రెస్ నొట్ లో పలు కీలక విషయాలను వెల్లడించడం జరిగింది.

చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులను కించపరిచేలా తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ థియేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫీసర్‌ బేరర్స్‌ సమక్షంలో పలువురు చేసిన వ్యాఖ్యలను యాక్టివ్‌ తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొనడం జరిగింది.

సినిమా నిర్మాణాన్ని ప్రారంభించేది నిర్మాతే, నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి సినిమాకు పునాది వేసేది నిర్మాతే అని స్పష్టం చేయడం జరిగింది. ప్రాథమికంగా థియేటర్లలో విడుదల చేయాలని ఎల్లప్పుడూ భావిస్తాడు, గతంలో శాటిలైట్‌, ఇప్పుడు వివిధ ఓటీటీ మాధ్యమాల రాకతో, ఈ మార్గాలు అన్నిటి ద్వారా నిర్మాత తన పెట్టుబడిని రాబట్టుకుంటాడు అని తెలిపింది. చిత్రాన్ని ఎప్పుడు, ఎక్కడ విడుదల చేయాలనే నిర్ణయం తీసుకునే హక్కు నిర్మాతది అంటూ చెప్పుకొచ్చింది.

ఓటీటీ మాధ్యమంలో తమ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న హీరో, నిర్మాతను సభాముఖంగా విమర్శించడం, వ్యక్తిగతంగా బెదిరించడం సరికాదు అని, ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం అనిపించుకోదు అని, చిత్రంపై సర్వహక్కులు నిర్మాతకు చెందుతాయని తెలిపింది. తెలుగు చిత్ర పరిశ్రమలో మార్కెట్‌ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు అని, అందువల్లే, పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది అని, ప్రత్యేకంగా ఒక హీరోను ఎవరైనా టార్గెట్‌ చేయడం ద్వారా పరిశ్రమలోని ఆరోగ్యకర, స్నేహపూర్వక సంబంధాలను దెబ్బ తీస్తుంది అంటూ హెచ్చరించడం జరిగింది. నిర్మాతలు, హీరోలు, సాంకేతిక నిపుణులు ఎవరైనా ఒంటరి కాకూడదు అని, ఏ సెక్టార్‌ చేత వెలివేయబడకూడదు అని తెలిపింది.

పరిశ్రమ ఎదుర్కొంటోన్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి నిర్మాతలకు సహాయపడమని వివిధ వేదికల్లో ఎగ్జిబిటర్లకు విజ్ఞప్తి చేశామని, ఇవాళ, ఎగ్జిబిటర్లు కేవలం విపరీతమైన డిమాండ్‌ ఉన్న సినిమాల పై ఆసక్తి కనబరుస్తున్నారు అని, చిన్న, ఓ మాదిరి చిత్రాలను పట్టించుకోవడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేయడం జరిగింది. వాటిని విస్మరిస్తున్నారు. దాంతో చాలా చిత్రాలు వివిధ మార్గాల ద్వారా తమ పెట్టుబడిని రాబట్టుకుంటున్నాయి అని తెలిపింది.

నిర్మాతల మనుగడను ఎవరూ, ఏ రంగమూ నిర్దేశించకూడదు, బెదిరించకూడదు అని తేల్చి చెప్పింది. పరిశ్రమ పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, వివిధ వ్యాపార భాగాస్వాములు, పరస్పరం ఒకరిపై మరొకరు ఆధారపడిన పరిశ్రమ తమది అని, వ్యక్తిగతంగా, పరిశ్రమగా మనమంతా కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నామని, అన్ని సెక్టార్లు కష్టకాలంలో ఉన్నాయని అర్థం చేసుకున్నామని, వారితో పాటు తాము బాధపడుతున్నట్లు తెలిపింది. పరస్పర మద్దతు ఆశిస్తున్నామని, గతంలో ఎదుర్కొన్న సమస్యలకు అందరం కలసికట్టుగా పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నాం అంటూ పేర్కొనడం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం మనమంతా సమష్టిగా పని చేయాలి అంటూ చివరగా చెప్పుకు వచ్చింది. యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ చేసిన ఈ ప్రకటన సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు