ఆస్కార్ విన్నింగ్ రీమేక్‌లో చేయబోతున్నా – అడివి శేష్

ఆస్కార్ విన్నింగ్ రీమేక్‌లో చేయబోతున్నా – అడివి శేష్

Published on Apr 6, 2022 11:30 AM IST

టాలెంటెడ్ నటుడు అడివి శేష్ తన రాబోయే చిత్రం మేజర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మే 27, 2022న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ జీవిత చరిత్ర చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. నటుడు మేజర్ కోసం ప్రమోషన్ల ను ప్రారంభించాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, తన పైప్‌లైన్‌లో చాలా సినిమాలు ఉన్నాయని మరియు ఆస్కార్ విన్నింగ్ మూవీని రీమేక్ చేయబోతున్నట్లు వెల్లడించాడు.

ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మాత అభిషేక్ అగర్వాల్‌తో తనకు స్ట్రెయిట్ హిందీ సినిమా ఉందని అడివి శేష్ చెప్పాడు. ఈ లోగా, నటుడు ఇప్పటికే రెండు సినిమాలకు సంతకం చేసాడు. గూఢచారి 2 మరియు హిట్ 2. మేజర్ విడుదల తర్వాత అతని తదుపరి చిత్రం పై మరింత క్లారిటీ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు