నవీన్ పొలిశెట్టి, శృతి శర్మ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం `ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ`. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను తెచ్చుకుంది. ఇక ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేస్తున్నారు. స్వరూప్ ఆర్.ఎస్.జె దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.
నవీన్ ఈచిత్రంలో డిటెక్టివ్ పాత్రధారిగా నటించారు. సినిమా ఆసాంతం ఎంటర్ టైనింగ్గా ఉంటుందట. మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించారు. మళ్ళీరావా చిత్రాన్ని అందించిన రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.