‘ఆకాశవాణి విశాకపట్టన కేంద్రం’ పోస్టర్ విడుదల చేసిన రాజ్ కందుకూరి !

‘ఆకాశవాణి విశాకపట్టన కేంద్రం’ పోస్టర్ విడుదల చేసిన రాజ్ కందుకూరి !

Published on Mar 20, 2019 11:00 AM IST

శివ , ఉమయ్ చంద్ , రక్ష, అక్షిత లు హీరో హీరోయిన్ లుగా నటించిన తాజా చిత్రం “ఆకాశవాణి విశాకపట్టన కేంద్రం”. సతీష్ బాతుల డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్నిసయిన్స్ స్టూడియోస్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమా పోస్టర్ రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా నిన్న విడుదలయ్యింది.

ఈ సందర్భంగా రాజ్ కందుకూరి గారు మాట్లాడుతూ ఈ కథ నాకు ముందే తెలుసు, సతీష్ కథ చెప్పినప్పుడే మంచి పాయింట్ తో వీళ్ళు సినిమా తీస్తున్నారు, ఇది పెద్ద హిట్ అవుతుంది అని భావించా. ఈ రోజు పోస్టర్ చూస్తుంటే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో మనకు అర్ధమవుతుంది. మల్లిఖార్జున వంటి నిర్మాత ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకు రావడం ఆయనకు సినిమా పట్ల ఎంత ఇష్టం ఉందో మనకు తెలుస్తుంది అని కొనియాడారు”.

హీరో శివ మాట్లాడుతూ సతీష్ నా దగ్గరకు ఒక మంచి కథ తో వచ్చాడు. కథ వినిన వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం భయ్యా అని చెప్పా, కథ అంత బాగుంటుంది. 36 రోజుల్లో ఒక అద్భుత కావ్యాన్ని చెక్కాడు మా శివ. తను దర్శకుడి గా ఒక పెద్ద స్థాయిలో ఉంటాడు. అని తెలిపారు.

నిర్మాత మల్లిఖార్జున్ మాట్లాడుతూ ముందుగా మా సినిమాకు ఇంత సపోర్ట్ అందించిన రాజ్ కందుకూరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమా చాలా బాగా వచ్చింది. నాకు కూడా రాజ్ కందుకూరి లాగా నిర్మాత లా నిలబడదాం అనే ఇండస్ట్రీ కి వచ్చాను. మొదటి సినిమానే మంచి కథ తో మీ ముందుకు వస్తున్నా, అందరూ మా సినిమాను సపోర్ట్ చేయండి అని కోరారు.

దర్శకుడు సతీష్ మాట్లాడుతూ నేను జబర్దస్త్ షో నుండే మీ అందరికి తెలుసు, ఒక మంచి కథ తయారు చేసుకొని శివ తో చెప్పా, శివ వెంటనే మనం చేద్దాం భయ్యా అన్నాడు. అలా ఈ సినిమా స్టార్ట్ అయింది. మా సినిమాకు నిర్మాత బ్యాక్ బోన్. తను లేకపోతే ఈ సినిమా లేదు. సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా ఒక మంచి సినిమా ఇస్తా అనే పూర్తి నమ్మకం నాలో ఉంది అని తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు