హిట్ డైరెక్టర్ కి సినిమా సెట్ అయిందా ?

హిట్ డైరెక్టర్ కి సినిమా సెట్ అయిందా ?

Published on Sep 10, 2019 12:00 PM IST

‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాడు పరుశురామ్. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. దాంతో పరుశురామ్ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. చాలా టైం తీసుకుని స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న పరుశురామ్, తన తరువాత సినిమాని సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కొరటాల శివ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ సినిమా ఎందుకో సెట్ అవ్వలేదు. కానీ ఆ తరువాత పరుశురామ్ – అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని వార్తలు వచ్చాయి.

కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపు సెట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పరుశు రామ్ అఖిల్ కి ఫుల్ స్క్రిప్ట్ చెప్పినట్లు.. స్క్రిప్ట్ విన్న అఖిల్ అండ్ నాగార్జున అంగీకారం చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి పరుశురామ్ అఖిల్ తో సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు