ఇప్పుడు మన ఇండియన్ సినిమాలోనే భారీ అంచనాలు నెలకొల్పుకున్న అతి తక్కువ సినిమాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కలయికలో దర్శక ధీరుడు తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. అయితే ఈ భారీ చిత్రం ఇంకా షూటింగ్ దశలో ఉంది ఓ పక్క శరవేగంగా షూట్ ను జరుపుకుంటుండడంతో పాటుగా కనీ వినీ ఎరుగని స్థాయి బిజినెస్ ని జరుపుకుంటుంది.
అలా మొన్ననే నార్త్ హక్కులు కళ్ళు చెదిరే ఫిగర్ కు అమ్ముడు పోగా ఇప్పుడు ఓవర్సీస్ హక్కులు లాక్ అయ్యినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రాన్ని ఓవర్సీస్ లో సరిగమ మరియు రాఫ్టర్ క్రియేషన్స్ వారు కలిసి సంయుక్తంగా విడుదల చెయ్యనున్నట్టుగా తెలిపారు. ఇలాంటి సినిమాను తాము ప్రెజెంట్ చేస్తున్నందుకు గాను గర్వపడుతున్నట్టుగా తెలిపి ఈ సినిమా గ్రాండ్ ప్రీమియర్స్ వచ్చే అక్టోబర్ 12న పడనున్నట్టుగా తెలిపారు. అయితే ఓవర్సీస్ లో కూడా ఆ మోస్ట్ అవైటెడ్ చిత్రానికి సాలిడ్ ఫిగర్ దక్కిన సంగతి తెలిసిందే.
We, @sarigamacinemas & @RaftarCreations, take immense pride in announcing that we acquired the USA theatrical rights of India's biggest multistarrer. @SSRajamouli’s #RRRMovie ????????
@tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @oliviamorris891 @RRRMovie @DVVMovies pic.twitter.com/JGOZm8hRWj
— Sarigama Cinemas (@sarigamacinemas) April 7, 2021