ఎప్పటినుంచో అనుకుంటున్న త్రివిక్రమ్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ఎట్టకేలకూ ఈ రోజు అధికారికంగా పూజ కార్యక్రమంతో ప్రారంభం అయింది. ఈ ముహూర్తం వేడుకకు త్రివిక్రమ్ – బన్నీతో పాటు మొత్తం చిత్రబృందం కూడా పాల్గొంది. ఈ సందర్భంగా ఈ నెల 24 నుండి ఈ సినిమా రెగ్యూలర్ షూట్ కి వెళ్ళబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా తెలిపింది.
ఇక ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే త్రివిక్రమ్ తో ‘అరవింద సమేత’కి, అలాగే బన్నీతో డీజే సినిమాకి పనిచేసింది. ఈ సినిమాను అల్లు అరవింద్ తో కలిసి చినబాబు నిర్మించనున్నారు. ఇక ఈ చిత్రం కథ విషయానికి వస్తే తండ్రి కొడుకుల మధ్య సాగే హై ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది.
ముఖ్యంగా తండ్రి కొడుకులు మధ్య వచ్చే ఎమోషన్సే ప్రధానాంశంగా సినిమా ఉంటుందట. ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాల విజయాల తరువాత బన్నీ – త్రివిక్రమ్ కలిసి మూడోసారి చేస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.