నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా మలయాళ చిత్రం ఏబిసిడి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శ్రవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. నవంబర్ 2న లాస్ట్ షెడ్యుల్ ను ప్రారంభించిన ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ను పూర్తీ చేసుకోనుంది.
కాగా ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ నటిస్తున్నారు. మధుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మధుర శ్రీధర్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్పై యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదలకానుంది.


