రేపు లాంచ్ కానున్న అల్లు శిరీష్ కొత్త సినిమా !

రేపు లాంచ్ కానున్న అల్లు శిరీష్ కొత్త సినిమా !

Published on Jun 17, 2018 4:00 PM IST

ఇటీవలే ‘ఒక్క క్షణం’ తో ప్రేక్షకుల్ని పలకరించిన అల్లు శిరీష్ ఇప్పుడు కొత్త సినిమాను మొదలుపెట్టనున్నారు. ఈసారి ఆయన మలయాళ చిత్రం ఏబిసిడి (అమెరికా బోర్న్డ్ కన్ఫ్యూజ్డ్ దేశి)ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. మధుర శ్రీధర్, యాష్ రంగినేనిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నారు.

ఈ సినిమా రేపే అధికారికంగా లాంచ్ కానుంది. ఈ సినిమాకు కన్నడ కంపోజర్ జుడా శాండీ సంగీతాన్ని అందివ్వనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో కథానాయకిగా ఎవరు నటించనున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ చేసిన ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ ను అందుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు