చిరంజీవి కోసం పారితోషికం తీసుకోలేదట !

చిరంజీవి కోసం పారితోషికం తీసుకోలేదట !

Published on Sep 22, 2019 6:05 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం రంగం సిద్ధం చేసుకుని ఘనంగా జరుపుకోబోతుంది. కాగా బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నగా కనిపించనున్నారు. కాగా తాజాగా ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమితాబ్ ఈ సినిమాలో నటించినందుకు గానూ ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోలేదట. కేవలం చిరుతో తనకున్న అనుబంధం కారణంగానే అమితాబ్ ఈ చిత్రంలో నటించారట. ఈ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే బాలీవుడ్ లోని కొంతమంది ప్రముఖలకు సైరా స్పెషల్ షోను వేయాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇక ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు