మన తెలుగు సినిమా బాహుబలి దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మన అందరికీ తెలుసు. మన ఇండియన్ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా బాహుబలి సిరీస్ ఉంది. అయితే తన సినిమా బాహుబలిని మించిన హిట్ అంటున్నారు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్.
అమితాబ్ కు బాలీవుడ్ లో ఉన్న అశేషమైన ఆదరణ కానీ ట్రాక్ రికార్డు కానీ అనన్య సామాన్యం. అలాంటి అమితాబ్ ఒక ఆసక్తికర ట్వీట్ పెట్టారు. తాను వినోద్ ఖన్నా రిషి కపూర్ ల కలయికలో నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం “అమర్ అక్బర్ ఆంటోనీ” చిత్రం నేటితో 43 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంలో తన సోషల్ మీడియా ద్వారా అమితాబ్ ఆ రోజుల్లో ఈ చిత్రం 7.25 కోట్లు రాబట్టింది అది ఇప్పుడు బాహుబలి 2 వసూళ్లను దాటేసింది అని ఓ శారద ట్వీట్ వేశారు. అంటే ఇప్పుడు హిందీలో విడుదల కాబడిన బాహుబలి 2 అక్కడ 500 కోట్లకు పైగా రాబట్టింది. అలాగే అదే స్థాయి వసూళ్ళని 43 ఏళ్ల కితమే తన చిత్రం కూడా సాధించింది అన్నది అమితాబ్ వెర్షన్..
T 3544 -43 YEARS .. !!! .. 'Amar Akbar Anthony' is estimated to have made Rs 7.25 crore in those days. Inflation-adjusted, it crosses the collections of Bahubali 2—The Conclusion today!
#43YearsOfAmarAkbarAnthony pic.twitter.com/u5IMiOV2zt
— Amitabh Bachchan (@SrBachchan) May 27, 2020