తెలుగు ఫేమస్ న్యూస్ చానల్స్ లో క్రైమ్ స్టొరీస్ చెప్పడంలో బాగా ఫేమస్ అయిన యాంకర్ హర్షవర్ధన్. ఈ హర్షవర్ధన్ ఓ దేనత్ల్ కాలేజ్ మానేజ్ మెంట్ ని బ్లాక్ మెయిల్ చేసాడని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసారు.
హర్షవర్ధన్ ఆ డెంటల్ కాలేజ్ మీద నెగటివ్ ఓ ప్రోగ్రాం చేసి ఓ ప్రముఖ చానల్ లో టెలికాస్ట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేసి 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసాడు. ఆ కాలేజ్ యాజమాన్యం ఒక లాయర్ ద్వారా తక్కువ అమౌంట్ కి సెటిల్ చేసుకోవాలని చూసినా దానికి హర్షవర్ధన్ అంగీకరించలేదు.
దాంతో ఏమీ చేయలేకపోయిన కాలేజ్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిరగి విజయవాడలో హర్షవర్ధన్ ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసులో హర్షవర్ధన్ వెనుక ఎవరన్నా ఉన్నారా లేక స్వయంగా తనే ఇందంతా నడిపించాడా.? అన్నదానిపై విచారణ జరుగుతోంది.


