ఈటీవీ ప్లస్‌లో సరికొత్త షో.. 60 మంది “జాతిరత్నాలు” ఒకే వేదికపై..!

ఈటీవీ ప్లస్‌లో సరికొత్త షో.. 60 మంది “జాతిరత్నాలు” ఒకే వేదికపై..!

Published on Mar 23, 2022 11:02 PM IST

బుల్లితెర ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కామెడీని అందించడంలో ఈటీవీ ఎప్పుడు ముందుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈటీవీలో వచ్చే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు కార్యక్రమాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈటీవీ ప్లస్ ద్వారా మరో సరికొత్త కామెడీ షోను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతుంది.

“జాతిరత్నాలు” పేరుతో వస్తున్న ఈ షోకు యాంకర్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. 10,000 మందిని ఆడిషన్ చేసి, 3000 రత్నాలను తీసి, అందులో నుంచి 60 మంది జాతిరత్నాలను తీసుకుని మీ ముందుకు వస్తున్నామని.. అయితే ముగ్గురు జాతిరత్నాలు ఉంటేనే సినిమా బ్లాక్ బస్టర్ అయితే.. 60 మంది జాతిరత్నాలు ఉంటే ఈ షో ఇంకెంత బ్లాక్ బస్టర్ అవుతుందని శ్రీముఖి చెప్పడం ఈ షోపై ఆసక్తిని పెంచేసింది. ఏప్రిల్ 4వ తేది నుంచి ప్రారంభం కాబోతున్న ఈ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు ఈటీవీ ప్లస్‌లో ప్రసారం కాబోతుంది.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు