మరో ‘ఆర్ ఎక్స్ 100’గా రాబోతున్న ‘రథం’ !

మరో ‘ఆర్ ఎక్స్ 100’గా రాబోతున్న ‘రథం’ !

Published on Aug 21, 2018 12:00 AM IST

‘ఆర్ ఎక్స్ 100’ చిత్రం ఎంతటి సంచలనాత్మక విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు అలాంటి కోవకు చిందిన చిత్రమే మరొకటి రాబోతుంది. నూతన దర్శకుడు చంద్ర శేఖర్ కానూరి దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం ‘రథం’. యువతను ఆకట్టుకున్నే అంశాలతో వస్తున్న ఈ చిత్రంలో నూతన నటీనటులు గీత ఆనంద్, చాందిని భాగవానని నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంభందించి ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నవీన్ ఎర్నేని ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా.. సీనియర్ యాక్షన్ డైరెక్టర్ బి. గోపాల్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీపట్నాయక్ సాంగ్ టీజర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఈ చిత్ర నిర్మాత రాజా దారపునేని మాట్లాడుతూ ఈ సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది, చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నాం. వచ్చే నెల రెండోవారంలో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.. హీరో చాలా చక్కగా నటించారు. హీరోయిన్ కి మంచి ఫీచర్ ఉందని అన్నారు.

ఆర్పీపట్నాయక్ మాట్లాడుతూ.. ఈ సినిమా కూడా ఆర్ ఎక్స్ 100 సినిమాలా కమర్షియల్ హిట్ సాధిస్తుందని, సుకుమార్ సంగీతం బాగుందని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ… రాజా తనకు మంచి పరిచయం ఉంది. త్వరలో విడుదల కాబోయే ఈ సినిమా అరెక్స్ 100, అర్జున్ రెడ్డి, గూడాచారి సినిమాల్లా మంచి విజయం సాధిస్తోంది అని తెలిపారు. .

చివరగా బి. గోపాల్ మాట్లాడుతూ… రాజా నాకు మంచి మిత్రుడు. సినిమా అంటే తనకు ప్రాణం. ఆ ఫ్యాషన్ తోనే ఇండస్ట్రీలో కి వచ్చాడు. తప్పకుండా ఈ చిత్రం ఘన విజయం సాధించి నిర్మాతగా తను సక్సెస్ కావాలని బ్లేస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు