‘ఈషా’ అందరినీ భయపెడుతుంది – నిర్మాత వంశీ నందిపాటి

esha

ఇటీవల లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి లాంటి సూపర్‌హిట్‌ కల్ట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓ హారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని డిసెంబరు 25న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్‌రాజ్, త్రిగుణ్‌ హీరోలుగా హెబ్బాపటేల్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హెచ్‌వీఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్‌ దామోదర ప్రసాద్‌ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈషా మూవీ ట్రైలర్‌ సక్సెస్ మీట్‌ను మేకర్స్ తాజాగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కెఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘ఈషా’ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. కేవలం హారర్ మాత్రమే కాకుండా థ్రిల్లర్ మూవీ. సినిమా చూసి బయటకు వచ్చిన తరువాత అందరూ కచ్చితంగా భయపడతారు. డిసెంబర్ 25 వరకు మేం సినిమాను ప్రమోట్ చేస్తూనే ఉంటాం. ఈ చిత్రంతో అందరికీ విజయం దక్కాలి.’ అని అన్నారు.

బన్నీ వాస్ మాట్లాడుతూ.. ‘నాకు, వంశీకి సినిమాలంటే చాలా ప్యాషన్. అందుకే ఈ ‘ఈషా’ బాధ్యతల్ని దాము గారు మాపై పెట్టారు. డిసెంబర్ 12 అన్నప్పుడు ప్రమోషన్స్‌కి టైం లేదు కదా? అని భయపడ్డాను. కానీ ఇప్పుడు మా ‘ఈషా’ని డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతోన్నాం. మేం భయపెట్టడం లేట్ అవ్వొచ్చేమో కానీ.. భయపెట్టడం మాత్రం కన్ఫామ్. ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ‘ఈషా’ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

వంశీ నందిపాటి మాట్లాడుతూ .. ‘‘ఈషా’ కాస్త లేట్ అవుతోంది. భయపెట్టడం లేట్ అవ్వొచ్చు కానీ.. భయపెట్టడం మాత్రం కన్ఫామ్. మేం కచ్చితంగా ఆడియెన్స్‌ని భయపెడతాం. సినిమా చూసి భయపడని వారు నాకు కాల్ చేయండి. శ్రీనివాస్ గారు ‘ఈషా’ని అద్భుతంగా తెరకెక్కించారు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.

హీరో త్రిగుణ్ మాట్లాడుతూ .. ‘ముందుగా మా ‘ఈషా’ మూవీని తలైవా బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకున్నాం. కానీ మా మూవీని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ చిత్రంలో చివరగా ఎంటర్ అయింది నేనే. నా ‘కథ’ మూవీని డైరెక్ట్ చేసి తెలుగులోకి పరిచయం చేసిన నా దర్శకుడు, గురువు శ్రీనివాస్ గారికి థాంక్స్. అప్పుడు నేను ఇంత దూరం ప్రయాణిస్తానని, 28 సినిమాలు చేస్తానని అనుకోలేదు. నేను నా ప్రతీ సినిమాతో బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తూనే ఉంటాను. బన్నీ వాస్ గారు, వంశీ గారు సినిమాను తీసుకున్నారంటే హిట్ అని, బ్రాండ్ అని చెబుతుంటారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. హారర్ సినిమాలు ఇష్టపడే వారందరికీ ఈ చిత్రం నచ్చుతుంది’ అని అన్నారు.

హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. ‘‘ఈషా’ కథను నమ్మి ముందుకు వచ్చిన దాము గారికి, బన్నీ వాస్ సర్‌కి, వంశీ గారికి థాంక్స్. శ్రీనివాస్ గారు అద్భుతమైన ఫిల్మ్ మేకర్. ఆయన ‘ఈషా’తో అద్భుతం చేయబోతోన్నారు. త్రిగుణ్‌తో మళ్లీ నటిస్తుండటం ఆనందంగా ఉంది. డిసెంబర్ 25న మా మూవీ రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

దర్శకుడు శ్రీనివాస్ మన్నె మాట్లాడుతూ.. ‘‘మా టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా టెక్నీషియన్లంతా కూడా బ్రేక్ దొరకాలి, విజయం దక్కాలని కష్టపడి పని చేశారు. దాము గారు మాకు ఈ ప్రయాణంలో ఎంతో సపోర్ట్ ఇచ్చారు. బన్నీ వాస్ గారు, వంశీ గారు మా మూవీని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా రిలీజ్ అయిన తరువాత మేం ఇంకా మాట్లాడతాం. డిసెంబర్ 25న మా చిత్రం రిలీజ్ అవుతోంది. అందరూ మా మూవీని చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత హేమ వెంకటేశ్వర రావు, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధృవన్, కెమెరామెన్ సంతోష్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

Exit mobile version