తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను, ఆడియో ను మే 31 న హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు. చిత్ర ట్రైలర్ కంటే ముందు, డైరెక్టర్ ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ చిత్రంపై భారీ అంచనాలు నెలకొల్పుతున్నారు. దీంతో ఈ చిత్ర ఆడియో ప్రత్యక్ష ప్రసారాలను ప్రసారం చేసేందుకు ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ5 భారీ ధర చెల్లించి ప్రత్యక్ష ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. కాగా ఇప్పటికే లహరి ఆడియో సంస్ద ఈ చిత్ర ఆడియో హక్కులను దాదాపు రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఆర్కా మీడియా వర్క్స్ పై తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాహుబలి ఆడియో టెలికాస్ట్ కు భారీ ధర
బాహుబలి ఆడియో టెలికాస్ట్ కు భారీ ధర
Published on May 23, 2015 9:23 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- థియేటర్/ఓటీటీ : ఈ వారం చిత్రాలివే!
- గ్లామరస్ కలెక్షన్ : సెన్సేషనల్ సమంత
- షారుఖ్ కంటే నాకు ఎక్కువ ఆఫర్ చేశారు.. పవన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- ఎన్టీఆర్ స్టైలిష్ ఫైట్సే మెయిన్ హైలైట్
- ప్రభాస్ ని టార్గెట్ చేస్తున్న ఓ సెక్షన్ ఆఫ్ మీడియా!?
- కన్ఫర్మ్: నార్త్ లో మరోసారి “RRR” రోర్..
- ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్ రిలీజ్ అప్పుడేనా ?