కృష్ణాలో ‘బాహుబలి’ కల్లెక్షన్స్ కి డోఖా లేదంట.!

కృష్ణాలో ‘బాహుబలి’ కల్లెక్షన్స్ కి డోఖా లేదంట.!

Published on Jul 10, 2015 8:00 PM IST

Baahubali-tamil
ఈ రోజు ఉదయం సుమారు 3 గంటల నుంచే తెలుగు సినీ ప్రేక్షకులంతా ఇండియన్ స్క్రీన్ పై ది బెస్ట్ విజువల్ వండర్ మరియు తెలుగు చలన చిత్ర సీమ గర్వించదగ్గ సినిమా ‘బాహుబలి’ అని కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు. బాహుబలి సినిమాకి భారీ ఓపెనింగ్స్ మాత్రమే కాకుండా అన్ని చోట్ల నుంచి చాలా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటోంది. ముఖ్యంగా ది మాస్టర్ మైండ్ అయిన ఎస్ఎస్ రాజమౌళి క్రియేట్ చేసిన మాహిష్మతి రాజ్యం విజువల్స్, మైండ్ బ్లోయిండ్ యాక్షన్ ఎపిసోడ్స్ అందరినీ థ్రిల్ చేస్తున్నాయి.

అన్ని ఎరియాల్లోనూ ఈ సినిమా రైట్స్ రికార్డ్ ప్రైజ్ కి అమ్ముడు పోయాయి. అన్ని చోట్లా ఈ సినిమా వారి అమౌంట్ ని బ్రేక్ చేసేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా కృష్ణా ఏరియా రైట్స్ ని అత్యధికంగా 4.5 కోట్లకి కొనుగోలు చేసారు. మొత్తం 28కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన కృష్ణా ఏరియాలో ఇప్పటికే మొదటి వారం టికెట్స్ మొత్తం అమ్ముడు పోయాయి. బెనిఫిట్ షోస్ నుంచి వస్తున్న టాక్ మరియు సూపర్ క్రేజ్ వలన మొదటి వారంలోనే డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన అమౌంట్ వచ్చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇలా బాహుబలి ప్రతి చోటా సరికొత్త రికార్డ్ సృష్టించడానికి సిద్దమవుతోంది.

బాహుబలి ప్రభాస్ కెరీర్లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ మరియు బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలవనుంది. రానా, తమన్నా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాని ఆర్కా మీడియా వారు నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు