ఆ బ్లాక్ బ్లాస్టర్ బాలీవుడ్ మూవీ సౌత్ లో రీమేక్ కానుంది !

గత ఏడాది బాలీవుడ్ లో విడుదలై బ్లాక్ బ్లాస్టర్ విజయం సాధించింది కామెడీ డ్రామా ‘బడాయి హో’. 30కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 200కోట్ల వసూళ్లను రాబట్టింది. అమిత్ షా డైరక్ట్ చేసిన ఈ చిత్రంలో ఆయుష్ మాన్ ఖురానా హీరోగా నటించాడు.

ఇక తాజాగా ఈ చిత్రం యొక్క రీమేక్ రైట్స్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సొంతం చేసుకున్నారు. ఈచిత్రాన్ని ఆయన అన్ని సౌత్ భాషల్లో రీమేక్ చేయనున్నారు. మరి ఈ చిత్రం యొక్క తెలుగు రీమేక్ లో ఎవరు హీరోగా నటిస్తారో చూడాలి.

Exit mobile version