పేస్ బుక్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించిన బాలకృష్ణ.!

పేస్ బుక్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించిన బాలకృష్ణ.!

Published on Jun 10, 2017 3:41 PM IST

balakrishna fb
భవ్య క్రియేషన్స్ ఆద్వర్యంలో పూరీ- బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పైసా వసూల్. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నేరుగా ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెబుతూ, అందరిని అలరించారు. ఈ పేస్ బుక్ లైవ్ లో బాలకృష్ణతో పాటు దర్శకుడు పూరీ కూడా పాల్గొన చిత్ర విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమా ని సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని పూరీ జగన్నాద్ ఈ పేస్ బుక్ లైవ్ లో చెప్పారు. అలాగే చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ బాలయ్య బాబుకి జోడీకి నటిస్తున్నారని పూరీ చెప్పారు. అలాగే ఈ లైవ్ కార్యక్రమంలోనే బాలయ్య , అభిమానుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుకోవడంతో పాటు, అభిమానుల కోరిక మేరకు లెజెండ్ సినిమాలోని డైలాగ్స్ వినిపించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్ లో జరుపుకుంటుంది. మొదటి సారిగా సోషల్ మీడియా ద్వారా బాలకృష్ణ అభిమానులతో ఇంటరాక్ట్ కావడం అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు