ఏప్రిల్ నుండి బాలయ్య – బోయపాటి ల కొత్త చిత్రం స్టార్ట్ కానుంది !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్ బాలకృష్ణ , బోయపాటి శ్రీను కలయికలో మరో చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ , లెజెండ్’ చిత్రాలు ఒకదానిని మించి ఒకటి హిట్ అవ్వడంతో ఈ కొత్త చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా ఈ మూడవ చిత్రానికి ముహూర్తం ఫిక్స్ చేశారని సమాచారం. అన్ని కుదిరితే ఈఏడాది ఏప్రిల్ నుండి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. బాలయ్య కోసం మరో సారి పవర్ ఫుల్ యాక్షన్ స్టోరీ ని సిద్ధం చేశారట బోయపాటి. మరి వీరిద్దరి కి ఈచిత్రం హ్యాట్రిక్ విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి.

ఇక ఇదిలావుంటే సంక్రాంతి సీజన్ లో బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు అలాగే బోయపాటి తెరకెక్కించిన వినయ విధేయ రామ చిత్రాలు ప్రేక్షకులముందుకు వచ్చి అంచనాలు అందుకోలేకయాయి. కథానాయకుడు మంచి రివ్యూస్ ను సొంతం చేసుకున్న కలెక్షన్ల పరంగా సత్తా చాటలేకపోతుంది. ఇక వినయ విధేయ రామ కి బ్యాడ్ టాక్ వచ్చిన కూడా బీసీ సెంటర్లలో పర్వాలేదనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా ఈరెండు చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకులను స్టాటిస్ఫై చేయలేకపోయాయి.

Exit mobile version