సాయి శ్రీనివాస్ 5వ సినిమా అప్ డేట్స్ !

సాయి శ్రీనివాస్ 5వ సినిమా అప్ డేట్స్ !

Published on Aug 12, 2018 6:06 PM IST

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల ‘సాక్ష్యం ‘చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం యావరేజ్ చిత్రం గానే మిగిలిపోయింది. ఈ సినిమా తరువాత ఆయన ప్రస్తుతం నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో తన 5 వ చిత్రంలో నటిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈచిత్రానికి కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారు . వంశధార క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈచిత్రంలో బాలీవుడ్ నటుడు నిల్ నితిన్ ముఖేశ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు