సూపర్ స్టార్ మహేష్ బాబు , కియారా అద్వానీ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెలుగు భాషలో తెరకేక్కిన సినిమా భరత్ అనే నేను ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ను సాధించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికి ఈ సినిమా దిగ్విజయంగా ప్రదర్శిచబడుతుంది.
తెలుగు వెర్షన్ లో తమిళనాడు లో రిలీజ్ అయిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ దక్కింది . దాంతో ఈ చిత్రాన్ని తమిళ , మళయాళ బాషలలోకి అనువాదం చేసారు . తమిళ్ వెర్షన్ లో ‘భరత్ ఎనుమ్ నాన్’ పేరుతో వస్తున్న ఈ సినిమాని ఈ నెల 31న విడుదల చేయనున్నారు . డి వి వి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డి వి వి దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు .