బాడీగార్డ్ స్పెషల్ షోస్ వేసిన నిర్మాత

బాడీగార్డ్ స్పెషల్ షోస్ వేసిన నిర్మాత

Published on Jan 9, 2012 5:49 PM IST


విక్టరీ వెంకటేష్ తన తరువాత చిత్రం ‘బాడీగార్డ్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు. ఈ చిత్రం జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబందించిన స్పెషల్ షో నిన్న ప్రసాద్ లాబ్స్ లో వేయడం జరిగింది.

వెంకటేష్, సురేష్ బాబు, బెల్లంకొండ సురేష్ బాబు, మరియు తమన్ పలువురు ప్రముఖులు ఈ షోకి హాజరయ్యారు. వెంకటేష్ సరసన త్రిషా మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. తమన్ సంగీతం అందించగా బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఈ సంక్రాంతికి బాడీగార్డ్ తో పాటు బిజినెస్ మేన్ చిత్రం కూడా విడుదలవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు