రోజురోజుకి రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో. ఇండిపెండెన్స్ డే కానుకగా అగస్ట్ 15 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమౌతోంది. ఇక సాహో ట్రైలర్ ను జూన్ 13న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇక యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రోఫ్, మందిరా బేడి నెగిటివ్ పాత్రలను పోషిస్తున్నారు, అయితే హిందీ నటుడు చుంకీ పాండే కూడా ఈ సినిమాలో ఆశ్చర్యం కలిగించే ఓ పాత్రలో కనిపించబోతున్నాడట. అతని ట్రాక్ ఈ చిత్రంలో చాలా ఘోరమైనది మరియు ప్రత్యేకమైనదని ఆయన చెప్పుకొచ్చాడు.
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.