కరోనాతో సీనియర్ నిర్మాత మృతి

కరోనాతో సీనియర్ నిర్మాత మృతి

Published on Jun 6, 2020 10:15 AM IST

కరోనా బాలీవుడ్ పై పంజా విసురుతుంది. ఇప్పటికే అనేక మంది దీని బారినపడ్డారు. మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ కరోనా కారణంగా మరణించిన సంగతి తెల్సిందే. వారి అమ్మ రజీనాకి కూడా వైరస్ సోకిట్లు వైద్యులు నిర్ధారించారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నిర్మాత అనీల్ సూరి కన్నుమూశారు.ఆయన వయసుకు 77 ఏళ్లు అని తెలుస్తుంది.

ఈ సందర్బంగా అనీల్ సోదరుడు నిర్మాత రాజీవ్ సూరీ మీడియాకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘అనీల్ జూన్ 2 నుండి హై ఫీవర్‌తో బాధపడుతున్నారు. తర్వాతి రోజు నుండే అతని ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. వెంటనే లీలావతి, హిందూజా ఆసుపత్రికి తీసుకెళ్లగా వారు అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించారు అని అనీల్ సోదరుడు చెప్పారు. శుక్రవారం ఉదయం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో అనీల్ అంత్యక్రియలు నిర్వహించారు. అనీల్‌కి భార్య ఇద్దరు సంతానం ఉన్నారు.అనీల్ .. రాజ్‌కుమార్‌, రేఖ కాంబినేషన్‌లో ‘కర్మయోగి’, ‘రాజ్‌ తిలక్‌’ వంటి చిత్రాలు ఇక నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు