మెగాస్టార్ మళ్లీ అక్టోబర్ నుంచి బిజీ !

మెగాస్టార్ మళ్లీ అక్టోబర్ నుంచి బిజీ !

Published on Jul 17, 2019 10:42 PM IST

మెగాస్టార్ చిరంజీవి సైరా తరువాత తన తర్వాత సినిమాని దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ మొదటి వారాం నుంచి మొదలు కానుందని.. వరుసగా పదిహేను రోజులు పాటు షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక డైలాగ్ రైటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన అతికొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను రాయడంలో కొరటాలకి మంచి పట్టు ఉంది.

కాగా చిరంజీవి కోసం కొరటాల శివ ఓ సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను సిద్ధం చేశాడట. ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ రెండవ వారంలో ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్, స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ సైరా నర్సింహారెడ్డి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ఆగష్టు చివరి వారం కల్లా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు