పకడ్బందీగా ప్లాన్ చేస్తున్న చిరు

పకడ్బందీగా ప్లాన్ చేస్తున్న చిరు

Published on Apr 6, 2020 8:00 PM IST

కరోనా లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పోయి ఇక్కట్లు పడుతున్న సినీ కార్మికుల సహాయార్ధం మెగాస్టార్ చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీ స్థాపించి భారీ విరాళాలు సేకరించారు. దీనికి స్పదించిన చిత్ర ప్రముఖులతో పాటు ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, బాలయ్య, బన్నీ వంటి స్టార్స్ పెద్ద ఎత్తున ఆర్ధిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన స్పందనకు మెగాస్టార్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా విరాళాల ద్వారా వచ్చిన డబ్బులను అర్హులైన వారికి చేరేలా చిరంజీవి గట్టి ప్రణాళికలు వేస్తున్నారట.

టాలీవుడ్ లోని వివిధ శాఖలకు చెందిన పెద్దలను, అధ్యక్షలను పిలిచి ఆర్గనైజ్డ్ గా ఈ కార్యక్రమం జరిగేలా చర్యలు తీసుకుంటున్నారట. పరిశ్రమలో ప్రతి పేద కార్మికుడి కుటుంబానికి ఈ విరాళాల ద్వారా అందే ప్రయోజనం చేరేలా ఆయన కట్టి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. పరిశ్రమలో మంచి వ్యక్తిగా పేరున్న చిరంజీవి ప్రతి సేవా కార్యక్రమంలో తన ప్రత్యేకత చాటుకుంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు