ఎన్టీఆర్ రోల్ పై వైరల్ అవుతోన్న క్రేజీ రూమర్ ?

ఎన్టీఆర్ రోల్ పై వైరల్ అవుతోన్న క్రేజీ రూమర్ ?

Published on Apr 24, 2020 7:31 PM IST

‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ ఎన్టీఆర్ తో దర్శకుడు త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కార్పొరేట్ ఉద్యోగిగా కనిపిస్తాడట. ఈ పాత్ర కోసం ఒక క్రేజీ మేక్ ఓవర్ లో ఎన్టీఆర్ వెరీ స్టైలిష్ గా కనిపిస్తాడట. ఈ వార్త ఇంకా ధృవీకరించబడనప్పటికీ, ఇప్పుడు ఇది వైరల్ అయ్యింది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందొ తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకూ ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారట. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. ఇక మరో కథానాయికగా తన గత రెండు సినిమాల్లో నటించిన పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నారట త్రివిక్రమ్.

కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం అక్టోబర్ నుండి షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా 2021 సమ్మర్ లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు