రజిని కాంత్ వయసుతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేస్తున్నారు. 2010లో వచ్చిన రోబో చిత్రం తరువాత దాదాపు నాలుగేళ్ళ గ్యాప్ తీసుకున్న ఆయన 2014నుండి వరుస చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజిని టాలెంటెడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ అనే చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కాగా ఈ చిత్రం తరువాత మరో క్రేజీ డైరెక్టర్ తో మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.
గౌతమ్ వాసుదేవ్ మీనన్ ‘తలైవా’తో సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ‘రజనీకాంత్, మమ్ముటీ వీరిద్దరిలో ఎవర్ని మీ సినిమాలో లీడ్ రోల్గా తీసుకుంటారు’ అని ఓ టీవీ షోలో గౌతమ్ని అడిగితే.. ఆయన రెండో ఆలోచన లేకుండా రజనీకాంత్ అని సమాధానమిచ్చారు. ‘కబాలి’ తర్వాత ఆయనతో తప్పకుండా సినిమా చేస్తానని కూడా ఆయన ఆ షోలో తెలిపారు. అయితే ఇప్పుడాయన రజనీ కోసమే ఓ కథ తయారు చేసే పనిలో ఉన్నారట. ప్రస్తుతం రజనీకాంత్ ‘దర్బార్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆయన లండన్లో షూటింగ్ పూర్తి చేసుకొచ్చాక గౌతమ్ కథ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తమిళవర్గాల సమాచారం.