రివెంజ్ డ్రామాగా వస్తున్న దమ్ము

రివెంజ్ డ్రామాగా వస్తున్న దమ్ము

Published on Jan 19, 2012 11:03 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నత్స్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రం పవర్ఫుల్ రివెంజ్ డ్రామా గా తెరకేక్కుతున్నట్లు సమాచారం. అలాగే చిత్రంలోని ఫ్లాష్ బ్యాక్ లో కొన్ని అనుకోని మలుపులతో సాగుతుందని సమాచారం.

ఎన్టీఆర్ పలు విభిన్నమైన గెటప్ లతో కనిపించబోతుండగా త్రిషా మరియు కార్తీక హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు బోయపాటి శీను పలు జాగ్రత్తలు తీసుకొని ఎన్టీఅర్ కారెక్టర్ ని డిజైన్ చేసినట్లు సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తుండగా వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దమ్ము చిత్రం ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతుంది. ఎన్టీఅర్ ఫ్యాన్స్ ఈ చిత్రం పై భారీ అంచనాలతో ఉండగా దమ్ము వారి అంచనాలకు చేరుకుంటుందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు