ప్రస్తుతం మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా చెప్పుకునే వాళ్ళలో దర్శకరత్న దాసరినారాయణ రావు ఒకరు. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో జరిగే తప్పులపై ఘాటుగా స్పందించే దాసరి ఈ రోజు వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ‘ప్రియతమా నీవచట కుశలమా’ ప్లాటినం డిస్క్ వేడుకకి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన కోన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. దాసరి మాట్లాడుతూ ‘ ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రతి ఆడియో ఫంక్షన్ రికార్డింగ్ డాన్సు షోస్ మాదిరిగా ఉన్నాయి. అలాంటి వేడుకలు ఇండస్ట్రీకి శ్రేయష్కరం కాదు. అందుకే నేను ఇలాంటి కార్యక్రమాలకి నేను హాజరు కావడం లేదు. ఆడియో గానీ సినిమా గానీ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని’ ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే దాసరి గారు ఓ కార్యక్రమమలో హీరోయిన్లు దర్శక, నిర్మాతలకు సరైన గౌరవం ఇవ్వడం లేదని, తమ సినిమాల ఆడియో ఫంక్షన్ లకే రావడం లేదని హీరోయిన్స్ పై సంచలన వ్యాఖలు చేసారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- “జై హనుమాన్”.. అదిరే పోస్టర్ తో ప్రశాంత్ వర్మ గూస్ బంప్స్ ప్రామిస్
- మైండ్ బ్లాకింగ్ గా “మిరాయ్” టైటిల్ గ్లింప్స్.. మరోసారి సర్ప్రైజ్ చేయబోతున్న తేజ సజ్జ
- టాక్ : ఈసారి టార్గెట్ మిస్ అవ్వదంటున్న రౌడీ హీరో ?
- ఈ నాలుగు భారీ చిత్రాలను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేయనున్న అనిల్ తడాని!
- ‘ది రాజా సాబ్’ : ఆ వార్తల్లో నిజం లేదట ?
- ఇస్మార్ట్ బ్యూటీతో ప్రభాస్ ఆటా పాట.!
- ఆ రికార్డు దిశగా దూసుకుపోతోన్న ‘టిల్లు స్క్వేర్’