నాగార్జున ల్యాండ్ లో డెడ్ బాడీ

నాగార్జున ల్యాండ్ లో డెడ్ బాడీ

Published on Sep 19, 2019 8:00 AM IST

కింగ్ నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో ఓ వ్యక్తి డెడ్ బాడీ కలకలం రేపింది. వివరాలలోకి వెళితే నాగార్జునకు హైదరాబాద్ శివారులో 40ఎకరాల వ్యవసాయ భూమి కలదు. ఆ భూమిలో గల ఒక పాడుబడిన గదిలో కుళ్ళిన స్థితిలో ఒక వ్యక్తి డెడ్ బాడీ కనిపించింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీస్ లు అక్కడకు చేరుకొని, శవాన్ని గుర్తించే పనిలో పడ్డారు.

హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పాపిరెడ్డి గూడా ప్రాంతంలో గల ఈ 40ఎకరాల ప్లాట్ లో జరిగిన ఈ సంఘటన పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఇటీవల స్పెయిన్ లో కుటుంబ సబ్యులతో కలిసి తన 60వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొని తిరిగి వచ్చిన నాగ్ బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు